ముల్కీ నిబంధనలు నైజాము రాజ్యేతర జనులకు నైజాములో ఉద్యోగ అవకాశములు లేకుండా చేయడానికి తీసుకువచ్చిన చట్టము.నిజాము ప్రభువు ముల్కి చట్టమును 1919 లో చేశాడు. ఆ రోజుల్లో హిందుస్తానీయులు, బెంగాలీలు కొంతమంది తమిళులు కూడా నిజాం కొలువులో ఉద్యోగాలు చేసేవారు. తెలంగాణ అనబడే తెలుగు వారి ప్రాంతములో నివసించే ఆంధ్రులు అనగా నైజాం ఆంధ్రులు ఉద్యోగాలు పొందడం కష్టంగా ఉండేది. ఉత్తర భారతీయుల ప్రాబల్యం నిజాము కొలువులో ఎక్కువగా ఉండేది. ముల్కి సూత్రాలు ఆ రోజుల్లో నిజాం రాజ్యంలోని ఆంధ్రుల హక్కులను కాపాడటానికి ఉద్దేశించినది.
తెలంగాణా లోని ఆంధ్రులు హైదరాబాదు లో ఉద్యోగాలకోసం నిజాం కాలంలో ఉద్యమించడానికి కారణాలు చాల ఉంటాయి. ప్రధానమయిన కారణం నిజాంలో ఉర్దు రాజ భాష. తెలుగు మాత్రు భాష అయిన ఆంధ్రులలో ఉర్దు భాషలో వ్రాయడం చదవడం వచ్చిన వారు చాల తక్కువ మంది ఉణ్దే వారు. ఉర్దు భాష ఔరంగాబదులో పుట్టింది.
నేను రచించిన ఈ “ప్రాచీన భారతీయులకు అక్షర సుమాంజలి (వేద కాల సమాజము)” అను పుస్తకము యొక్క విశేషములు తెలియజేసే పేజీ లోకి వెళ్ళడానికి, పుస్తకము కొనడానికి బుక్ ఫోటో పై క్లిక్ చెయ్యండి. వెల రు. 499/-
లేదా
పుస్తకమును అమెజాన్ ద్వారా కొనుగోలు చేయుటకు ఈ లింకు పై క్లిక్ చెయ్యండి. https://www.amazon.in/dp/B0CTSP19X3?ref=myi_title_dp
నా వీడియోలను యుట్యుబ్ లో తిలకించండి
ఔరంగాబదు హిందుస్థానికి దగ్గరగా ఉంటుంది. అందుచేత హిందుస్థానీలు ( హిందువులు మరియు ముస్లిములు) బంగాలీలు నిజాము కొలువులో ఎక్కువగా ఉండే వారు.
ఆంధ్రేతరులపై ( అనగా తెలుగు మాత్రు భాష కాని వారి పై ) వాడాల్సిన ఈ నిజాము యొక్క ముల్కి చట్టం ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడిన తరువాత కోస్తాంధ్రులను హైదరాబదు లో ఉద్యోగ అవకాశాలనుండి తప్పించడానికి ఉపయోగించడం శొచనీయము.
నా ఈ వ్యాసాలను కూడా చదవండి
ALSO READ
ఉన్దోగార్ధులకు ఉద్యోగ అవకాశాలలో తారతమ్యాలు ఏ దేశంలోనయిన ఉంటాయి.
వాటినిసామరస్యంగా పరిష్కరించే దారులు ప్రాంతాలను, జాతులను, విడదీయడానికి వైషమ్యాలను పెంచడానికిఈ అంశాన్ని ఉపయోగించకూడదు.
అసలు ఉద్యోగాల గురుంచి ఆంధ్రులు ప్రాంతాలవారిగ పోట్లాడుకోవడం సమస్యను తప్పు దారి పట్టించడమే. ఉదాహరణకు హైదరాబాదు లో ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కర్మాగారాల విషయం చూస్తే వాటిల్లోని అధికారిక ఉద్యోగాలు అన్ని ఉత్తర భారతీయులు గాని తమిళనాడు, కేరళవారు గాని కొలువు చేస్తుంటారు. చిన్న చిన్న ఉద్యోగాలకోసం ఆంధ్ర తెలంగాణా అంటు మనం పోట్లాడుకుంటుంటాము
ఈ పేజీలు కూడా చదవండి